రష్మి.. ఈ పేరు ఇప్పుడు కేరళలో యమా పాపులర్. ఆమె నడిపిన ఆన్ లైన్ సెక్స్ రాకెట్ బండారం బట్టబయలై ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ ఈ రష్మీ ఎవరంటే.. కొన్నాళ్ల క్రితం కిస్ ఆఫ్ లవ్ అనే కాంట్రావర్షియల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. అప్పట్లో ఈమె నిర్వహించిన ఈ ముద్దుల పండుగ కార్యక్రమం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. 


భారతీయ సంస్కృతిని ఈ కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నాశనం చేస్తోందని దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అయినా రష్మి, ఆమె భర్త ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అయితే భావ ప్రకటనకూ, వ్యక్తిగత స్వేచ్చకు పెద్దపీట వేసే కేరళలో ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న వారూ లేకపోలేదు. అలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అంతవరకూ ధైర్యశాలిగా గుర్తింపు పొందిన ఆమె ఓ సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందన్న విషయం ఇప్పుడు వెలుగు చూసింది.


కిస్ ఆఫ్ లవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ముసుగులో ఆమె ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహించిందట. పెద్ద ఎత్తున వ్యభిచారం చేయిస్తూ లక్షలు సంపాదింస్తోందట. అంతేకాదు ఈ సెక్స్ రాకెట్ ఉచ్చులో చాలామంది ప్రముఖులు కూడా చిక్కుకున్నారట. ఇటీవల పోలీసులు జరిపిన దాడుల్లో ఈమె, ఈమె భర్తతో పాటు పలువురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారట. 


పోలీసుల చేతికి చిక్కిన రష్మి.. పోలీసులకు అనేక సంచలన విషయాలు వివరించింది. తనను స్వయంగా తన భర్తే ఈ వ్యభిచార రొంపిలోకి దించాడని చెప్పింది. మొదట తన న్యూడ్ ఫోటోలను అనేక మంది ప్రముఖులకు పంపి వారిని ఆకర్షించారని పోలీసులకు గుట్టు బయటపెట్టింది. ఆ తర్వాత ఆ ప్రముఖుల అండతో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ విస్తరించుకుంటూ వెళ్లామని తమ సీక్రెట్స్ వివరించింది. పోలీసులు వీరి ఆన్ లైన్ సెక్స్ రాకెట్ కు సంబంధించిన ఫేస్ బుక్ ఖాతాలను గుర్తించారు. మరి ఈ దర్యాప్తులో ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: