ప్రపంచ దేశాల్లో అద్భుతమైన కట్టడాల్లో ఒకటి తాజ్ మహల్..అందుకే ప్రపంచంలో ఏడు వింతల్లో తాజ్ మహల్ కి స్థానం కల్పించారు. పాలరాతి నిర్మాణంతో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ అద్భుతమైన కళాకండం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.తాజ్ మహల్ మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.
తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది మరియు వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పని చేశారు. మన భారత దేశాన్ని సందర్శించాలని వచ్చే వారు తాజ్ మహల్ ని తప్పకుండా చూసి వెళ్తారు. యమునా నది తీరాన వెలిసిన సుందర కట్టడం. ఆ మద్య భారత దేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆగ్రలోని తాజ్ మహల్ చూసి తెగ సంబర పడిపోయాడట. అంతే కాదు ఫోటోలు, సెల్పీలు దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు.
తాజ్ మహల్
తాజాగా తాజ్ మహాల్ ని సందర్శించడానికి వచ్చిన ఫేస్ బుక్ టీం సభ్యులు పులకించిపోయారు. ఇంత చక్కటి తాజ్ మహల్ భారతదేశంలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అని వారు చెప్పారు. ఫేస్ బుక్ టీంలోని 30 మంది సభ్యులు అమెరికా నుంచి ఆగ్రా చేరుకున్నారు. తాజ్ మహల్ చరిత్ర దాని గొప్పతనం గురించి ఫేస్ బుక్ భారత ప్రతినిధి కే. రెడ్డి ఆ టీంను చెప్పారు. ఇంతటి అద్బుతమైన తాజ్ మహల్ చరిత్రను వారు తెలుసుకున్నారు. సుమారు గంట పాటు అక్కడే ఉన్నారు. అక్కడ ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలతో సందడి నెలకొంది.