తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్డీఏ ప్రభుత్వంపై మండి పడ్డారు..కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలే కేంద్రం వ్యవహరిస్తుందని అమె విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.  గత రెండు నెలల క్రితం చెన్నైలో జరిగిన ఘోర విపత్తు అందరికీ తెలుసు ఇప్పటికీ అక్కడి ప్రజలు వరద బీభత్సం మిగిల్చిన గాయం నుంచి కోలుకోలేదు. ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తీవ్రంగా విమర్శించారు.

పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచారని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమని పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్ 


 చముర ధరల నియంత్రణను ఆయిల్ కంపెనీలకు అప్పగించడాన్ని తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెంచిన  ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని జయలలిత కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: