గత కొంత కాలంగా తమిళనాడులో పీఎంకే పార్టీ అధ్యక్షులుగా జీకే మణి చురుకుగా పాల్గొంటున్నారు. పీఎంకే అధ్యక్షులు జీకేమణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. శనివారం రోజు ఆయన రాత్రి కళ్లుతిరిగిపోడిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆళ్వార్ పేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
జీకేమణిని పరీక్షించిన వైద్యులు ఆయన తలలో సమస్య ఉన్నట్లు వైద్య బృందం నిర్ధారించారు. అయితే చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని కుటుంబీకులతో తెలిపినట్లు సమాచారం. దీంతో కుటుంబీకులు అనుమతితో ఆదివారం చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని మరికొద్ది రోజుల్లో ఆయన పూర్తి గా కోలుకుంటారని వైద్యలు తెలిపారు.