తెలంగాణలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు మరోసారి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో, ఇందిరాగాంధీతో లాభపడిన ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ పార్టీనే నామారూపాయలు లేకుండా చేస్తానడడం పాముకు పాలు పోసి పెంచినట్లు అనిపిస్తుంది. తమ పార్టీ నేతలపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోదీ కూడా కలుస్తామని అక్బరుద్దీన్ అనడం మజ్లిస్ అవకాశవాద రాజకీయలకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ ను అంతం చేయడానికి అవసరమైతే ప్రధానిమోడితో చేతులు కలుపుతామనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు.

ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ ను వాడుకుని వదిలేసినట్టే రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు.పీసీసీ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని, దీనికి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇక నుంచి హైదరాబాద్ కాంగ్రెస్ ను తామే నడుపుకుంటామని హనుమంతరావు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: