జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పార్టీలోని అన్నివర్గాలు చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.. 

ఆయన ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనూ చదవండి.. ఇది కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ ఎన్నడూ ఏ పార్టీకీ ఇంత మెజారిటీ రాలేదు.  ఈ గెలుపుతో మనకు గర్వం వద్దు.. మనం ఇంకా అణకువతో పోవాలి. ఈ గెలుపుతో నాయకులపై మరింత భారం పెరిగింది. ఆ బాధ్యతను మనందరం గుర్తించాలి. ఈ ఓట్లు ప్రజలు ఇష్టపడి వేసినవి. 

మనం కష్టపడితే వచ్చిన ఓట్లు కావు.. ఇది ఎంత గొప్ప విజయమో.. మనం అంతే గొప్పగా ప్రజల సేవ చేసుకుందాం.. ఈ ఎన్నికల్లో మేం ఇచ్చిన మేనిఫెస్టోను తుచ తప్పకుండా అమలు చేస్తాం.. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. చెప్పినవీ చెప్పనివీ చేస్తాం.. పేదల ఎజెండానే మా ఎజెండా.



మరింత సమాచారం తెలుసుకోండి: