భారత దేశంలో రోజు రోజుకీ మహిళల పట్ల అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా వారిపట్ల వివక్షత కొనసాగుతుంది..చిన్నా పెద్దా అనే వయసుతో తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు కామాంధులు. నిర్భయ చట్టం అమల్లో ఉన్నా మహిళలపై ఇలాంటి దురాఘతాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన మరవక ముందే.. వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా కొందరు మృగాలు మహిళను వివస్త్ర చేసి ఊరేగించారు.

వివరాల్లోకి వెళితే..వరంగల్  జిల్లాలోని వర్థన్నపేట మండలం డీసీ తండాలో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన తలదించుకునేలా చేసింది. అంగోతు రవి అనే వ్యక్తి పెద్దలు నిశ్చయించి స్వరూప అనే యువతితో వివాహం జరిపించారు. అయితే రవి భార్యకూ, కుటుంబ సభ్యులకు తెలియకుండా ఏమిది నెలల క్రితం అనిత అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం బయట పడటంతో స్వరూప తల్లిదండ్రులు ఊరి పెద్దలను ఆశ్రయించారు.

అయినా కూడా ఫలితం లేకపోవడంతో రవి రెండవ భార్యను.. మొదటి భార్య ఆమె బంధువుల హింసలకు గురి చేస్తూ మానసికంగా, శారీరకంగా బాధపెడుతూ వస్తున్నారు..అయితే వారి ఆగడాలు మరీ మితిమీరీపోయి కర్రలు, ఇనుప చువ్వలతో కాల్చారు. అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్ర చేసి తండాలో ఊరేగించారు.  ఈ సంఘటన తెలిసిన కొంతమంది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి బాధితురాలు అనితను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: