ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బాగా వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వలస బాట పడితే..ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ బాట పడుతున్నారు. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నేతల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు రేపుతున్నాయి.తాజాగా ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో కి వస్తున్నారని ప్రచారం చేస్తున్న అక్కడి నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. కౌరవుల కన్నా ఒకరు ఎక్కువగానే ఉన్నా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

చంద్రబాబు తనకు అనుకూలమైన ఎల్లో మీడియా ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని వాస్తవానికి తమ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని కలవలేదని అన్నారు. మీ పార్టీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు రావడానికి మీ దగ్గర ఏమి సరుకు ఉందని రోజా ప్రశ్నించారు. తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అందరూ కళ్లారా చూస్తున్నారు. ఎంతో ఢాంబికాలకు వెళ్లి హైదరాబాద్ ను అంతా అబివృద్ది చేశానని చెప్పుకుని ప్రచారం చేసిన చంద్రబాబుకు జనం ఒక్క డివిజన్ మాత్రం ఇచ్చి బుద్ది చెప్పారని రోజా అన్నారు.  ఏపీలో కూడా కొన్నాళ్ల తర్వాత తెలంగాణ పరిస్థితి వస్తుతందని ఇక్కడ కూడా టీడీపీ మునిగిపోయే నావలాంటిదే అని ఎద్దేవా చేశారు.

దివంగత వైఎస్ రాజశేఖర్, జగన్ అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని వైఎస్ఆర్ చేసిన పనులు ప్రతిఒక్కరి గుండెల్లో నిలిచిపోయాయని ఆమె గుర్తు చేశారు. తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నించినా,ఒక్కరు కూడా రాలేదంటేనే నీ పార్టీ అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలని అన్నారు.తామంతా జగన్ కష్టాలలో ఉన్నప్పుడు ఆయన పార్టీలో చేరామని అన్నారు.వచ్చే ఎన్నికలలో కేవలం టిడిపికి రెండు సీట్లే వస్తాయని రోజా అన్నారు.చంద్రబాబు అస్తమించే సూర్యుడని, జగన్ ఉదయించే సూర్యుడు అని రోజా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: