ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమలు అనేవి సర్వ సాధారణం అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక అమ్మాయి గాని లేదా అబ్బాయి గాని ఎవరినైనా ప్రేమిస్తే ధర్యంగా ఇంట్లోవాళ్ళతో చెబితే వాళ్లు ఒప్పుకుంటే పెళ్లి జరుగుతుంది. లేదంటే ఇలాంటివి మన కుటుంబంలో చెల్లుబాటు కావని చెబితే వేరే వారితో పెద్దలు కుదుర్చిన సంబంధం తో సరిపెట్టుకుంటారు. పెళ్లి అయిన తర్వాత గతంలో జరిగిన ప్రేమలు దానికి సంబంధించిన వివరాలను భార్య గాని, భర్త గాని ఒకరికి ఒకరు తెలపకుండా సంసారాన్ని సాగిస్తారు.

 

 ఇదంతా రొటీన్ గా మనం ఇప్పుడు సమాజంలో చూస్తుందే. అయితే, ఇక్కడ ఈ రొటీన్ సీన్ కి భిన్నంగా ఒక సంఘటన చోటుచేసుకుంది. ఒక జంటకి పెళ్లి అయిన తర్వాత అతని భార్య తన మొగుడి పప్రేమ విషయం తెలుసుకొని మళ్లీ తిరిగి వారిద్దరికీ పెళ్లి చేసింది. చూడడానికి వింతగా ఉన్నా తన భర్త సంతోషం కోసం తాను ఇలా చేసింది కాబోలు. ప్రేమికుల జంటను విడదీసి అబ్బాయికి ఇంకో పెళ్లి చేశారు. ఆ ప్రేమ జంట ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. భార్య నిజం తెలుసుకొని భర్తకు లవర్‌తో పెళ్లి చేసింది. ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో చోటుచేసుకుంది.

 

రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన భాను అనే యువతిని ఇచ్చి పెద్దలు స్థానికి శ్రీ కొదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు. గత సంవత్సరం తప్పనిసరి పరిస్థితులలో ఓ యువతిని అప్పారావు పెళ్లి చేసుకున్నాడు. భాను, అప్పారావు ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య భానుకు, అప్పారావు పెళ్లి జరిపించింది. ఊరి పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని గ్రామ పెద్దలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: