మందు షాపులు విపరీతంగా ఉన్న హైదరాబాద్ లో పేకాట క్లబ్ లు కెసిఆర్ ఎందుకు మూయించారు అనేది ఎవ్వరికీ ఎప్పటికీ అర్ధం కాని ప్రశ్న. తెలంగాణా లో తెరాస ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ళ తరవాత ఈ నిర్ణయం తీసుకోవడం తో అప్పట్లో అది బాగా చర్చనీయాంశం అయ్యింది . నిర్ణయం చాలా మంచిది , జూదం - పేకాట తో ఇళ్ళు గుల్ల చేసుకుంటున్న పేకాట రాయుళ్ళ పని పట్టడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే కానీ ఒక్కసారి ఆ నిర్ణయం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ క్లబ్బులు ఎక్కువగా తెలుగు దేశం - కాంగ్రెస్ పెద్దలా చేతులలో ఉండడమే దీని వెనకాల ఉన్న అసలు గుట్టు అంటున్నారు. పోలీసులకి బాగా డబ్బులు ఇస్తూ తెలుగుదేశం - కాంగ్రెస్ నేతలు పుష్కలంగా కాసులు దండుకుంటూ ఉంటే వారి వారి ఇంకం ని కట్ చేసే విధంగా కథ సాగించారు కెసిఆర్.




మరొక రకంగా చూస్తే దీని వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది అంటున్నారు డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేంద్ర రెడ్డి. ఖమ్మం ప్లీనరీ లో ఆమె ఈ విషయం మాట్లాడుతూ ఆమెకి తెలిసిన ఒక ఎన్నారై మహిళా ఉంది అనీ ఆమె అమెరికా లో ఉండగా భర్త హైదరాబాద్ లో పేకాట కి బానిస అయ్యాడు అనీ చివరికి అమెరికా వెళ్ళడానికి కూడా డబ్బులు లేనంతగా పేకాట కి అలవాటు పడ్డాడు అనీ ఆ భర్త తనతో ఈ విషయం పంచుకోగా ఆమె కెసిఆర్ కి ఈ విషయం గురించి తెలియపరిచింది అనీ దాని తర్వాత ఇలా ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయో అని వెంటనే సీఎం మొత్తం పేకాట క్లబ్ లు మూసేసారు అని ఆర్డర్ జరీ చేసారు అని కెసిఆర్ పెద్దా మానసు గురించి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: