ఢిల్లీ ముఖ్యమంత్రి, అం ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీని ముప్పుతిప్పలు పెట్టడానికి అవకాశం ఉన్న ఏ అంశాన్నైనా వదలట్లేదు. మోడీ విద్యార్హత కు సంబంధించిని విషయాలను రాబట్టడానికి సమాచార హక్కు చట్టాన్ని మోడీపై ప్రవేశపెట్టడానికి కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాన మంత్రి మోడీని చిక్కుల్లో పడేశారు. ప్రధాని మోడీకి ఉన్న విద్యార్హతలేమిటో వెల్లడించాలని కేజ్రీవాల్ కేంద్ర సమాచారం కమిషన్ (సిఐసి)కి లేఖ రాశారు.

 

ప్రధాని మోడీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలయజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు.
‘ప్రధాని మోడీ తన విద్యార్హతల గురించి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా సంబంధిత విభాగాలను అడ్డుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రధాని ఎలాంటి విద్యార్హతలుగానీ, డిగ్రీలుకానీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని’ కేజ్రీవాల్ హిందీలో రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు.

 కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేరిట రాసిన ఈ లేఖలో సిఐసి పనితీరుపైనా కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘నా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కానీ ప్రధాని డిగ్రీల గురించి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది సిఐసి స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని’ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: