విజయ్ మాల్యా.. దాదాపు 9 వేల కోట్ల రూపాయల మేర వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టిన ఈ పారిశ్రామికవేత్త ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే వార్నింగ్ ఇస్తున్నాడు. పరోక్షంగా తనను మీరేమీ చేయలేరని సవాల్ విసురుతున్నారు. తాను బ్యాంకులకు ఎంతో కొంత ఇచ్చే ఆలోచనలోనే ఉన్నానని ఊరిస్తూనే.. మరోవైపు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు.

పాస్ పోర్టు రద్దు చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యల ద్వారా మీరేమీ సాధించలేరని మాల్యా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్లారిటీగా తేల్చి చెప్పేశాడు. పాస్ పోర్టును రద్దుచేయడం లేదా అరెస్టు చేయడం ద్వారా పైసా కూడా పొందలేరని కామెంట్ చేశారు. వ్యాఖ్యానించారు. రుణంద్వారా పొందిన సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణల్ని మాల్యా తోసిపుచ్చారు.

బ్యాంకులతో రాజీ కుదుర్చుకునేందుకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని... విజయ్ మాల్యా అంటున్నారు. వేల కోట్ల రూపాయలు సున్నం కొట్టి పరారైన మాల్యా.. తాను ఇప్పట్లో ఇండియాకు వచ్చే ఆలోచనే లేదని తేల్చి చెప్పేశారు. ఒక విధంగా తాను బలవంతంగా విదేశీవాసం గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. 

అంతేకాదు.. ఇంకా తానో దేశభక్తుడినని విజయ్ మాల్యా డబ్బా కొట్టుకుంటున్నాడు. దేశంపై ప్రేమతో తిరిగి వద్దామని అనుకుంటున్నా.. ఇప్పుడు ఇండియాలో తనకు అనుకూలంగా పరిస్థితులు లేవని వంకలు పెడుతున్నాడు. అందుకే తాను బ్రిటన్ లోనే భద్రంగా ఉండాలనుకుంటున్నాడట. అవును మరి అందుకే ఇంటి కంటే గుడి పదిలం అంటారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: