హీరోయిన్లంటే డబ్బుకు కొదువ ఉండదు.. కేరీర్ పచ్చగా ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకుని స్వల్పకాలంలోనే కనుమరుగవుతారు. మరి ఆ లగ్జరీ పొజిషన్ మెయింటైన్ చేయడానికో.. లేక సింపుల్ లైఫ్ లీడ్ చేయడం చేతకాకో తెలియదు కానీ.. చాలామంది హీరోయిన్లు కేరీర్ ముగిసిన తర్వాత అడ్డదార్లు తొక్కుతుంటారు. మరికొందరు కేరీర్ పీక్ లెవల్లో ఉండగానే తొక్కుతారనుకోండి. 

అలాంటి హీరోయిన్ల జాబితాలో ఇప్పడు ఒకనాటి బాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్ మమతా కుల కర్ణి కూడా చేరిపోయింది. మిగిలిన హీరోయిన్లలా ఈవిడ ఒళ్లమ్ముకోవడం కాకుండా డ్రగ్స్ మాఫియాతో లింకులు పెట్టుకుని.. ఇప్పుడు ఆ గుట్టు రట్టై వార్తల్లోకి ఎక్కింది. వెండితెరను వేడెక్కించిన ఈ హీరోయిన్ తెలుగు వారికి కూడా సుపరిచితమే..

మమత ఎంత పని చేసింది..!


టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఆ పూలరంగు.. నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్లలో అంటూ ఈమె చేసిన సందడి చూసిన వారు అంత ఈజీగా మర్చిపోరు. విక్కీ గోస్వామి అనే అతన్ని పెళ్లి చేసుకుని కెన్యా చెక్కేసిన ఈ భామ అక్కడి నుంచి ఇండియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోందట. 

మమత భర్త విక్కీ.. 


ఈ మధ్య షోలాపూర్ సమీపంలో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికిపోయాయి. దాదాపు 25 టన్నుల ఎపిడ్రిన్ దొరికింది. ఈ కేసు విచారణలో విక్కీ పాత్ర కూడా ఉందని తేలింది. గతంలోనూ ఈ విక్కీ గో స్వామి డ్రగ్స్ కేసులో పట్టుబడి 15 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడట. శిక్ష పూర్తి అయిన తర్వాత భార్య మమతతో కలిసి కెన్యా రాజధాని నైరోభి వెళ్ళి అక్కడ మళ్లీ ఇదే దుకాణం పెట్టాడట. 

ఈ మొత్తం ఎపిసోడ్ పై టీవీ9 ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. హీరోయిన్.. తాజా హెరాయిన్ పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసింది. కెన్యాలో ఉంటున్న మమతా కులకర్ణి రియాక్షన్ కూడా ప్రసారం చేసింది. ఆమె రొటీన్ గానే తమకేపాపం తెలియదని.. ఇదంతా తమకు ఇరికించేందుకు జరగుతున్న కుట్రగా వర్ణించింది.. చూడాలి ఈ డ్రగ్స్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: