ప్రపంచ దేశాలన్నింటిలో చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి దాన్ని ఏలుతున్న డాన్ దావూద్. అండర్ వరల్డ్ ప్రపంచంలో ఉన్న చోటా మోటా డాన్ లకు అధిపతి దావూద్. ప్రంచ భద్రతా బలగాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫీయా నేత దావూద్. ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సైతం దావూద్ చక్రం తిప్పాడు. అంతెందుకు పోలీస్ వాళ్ళల్లో కూడా దావూద్ మనుషులు ఉన్నారని రహస్య సమాచారం. మరి అంతటి నెట్ వర్క్ ని సంపాదించిన దావూద్ ఇప్పుడు  అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడని ఇటీవల మీడియా సంచలనం సృష్టించింది.

 

దీంతో ఈ విషయం ప్రపంచ నలుమూలలా పాకింది. ఇప్పుడు దావూద్ కి సంబంధించిన రహస్య సమాచారం తనకు తెలుసని ఒక యువకుడు హల్చల్ సృష్టిస్తున్నాడు. అతని దాగ్గర ఉన్న సమాచారం ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. దావూద్ ఇబ్రహీం గురించి పూర్తి సమాచారాన్ని గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు హ్యాక్ చేసినట్లుగా చెబుతున్నాడు. దానిని తాను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్తానని చెబుతున్నాడు. దావూద్ ఇబ్రహీం గురించిన చాలా విలువైన రహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్‌కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నాడు. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్స్ తాను రికార్డు చేశానని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇస్తానంటున్నాడు.

భారత్ నుంచి దుబాయ్‌కి నల్లధనాన్ని పంపించేందుకు దావూద్ ఇబ్రహీం వేసిన ప్రణాళికల వివరాలున్నాయని చెబుతున్నాడు. ఈ సమాచారాన్ని సేకరించేందుకు తన జీవితాన్ని కూడా పణంగా పెట్టానని, తొలి దశలో తనను ప్రోత్సహించిన వడోదరా పోలీసులు, అపై అనవసర ప్రశ్నలతో వేధించారని, ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రయత్నించినా, కుదరలేదని చెబుతున్నాడు. వీటిని తాను ప్రధాని మోడీకి మాత్రమే ఇస్తానని చెబుతున్నాడు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు తప్పయితే, ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించినట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన వద్ద దావూద్ ఇబ్రహీం వివరాలు వెల్లడించే ఎంతో సమాచారం ఉందని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: