కర్నూలు జిల్లా రాజకీయం లెక్కలు భలే రంజుగా సాగుతున్నాయి. మనకి అందుతున్న సమాచారం  ప్రకారం తాజాగా టీడీపీ ఎమెల్యే లు పార్టీని వీడి వైకపా లోకి ఒచ్చేలా కనిపిస్తున్నారు. కర్నూలు కి సంబంధించిన ఎమ్మెల్యే లు ఇద్దరికీ చంద్రబాబు నాలుగు రోజుల నుంచీ విజయవాడ లో క్లాసులు పీకుతున్న సంగతి తెలిసిందే. కలసి ఉండడం వలన ఉండే బెనిఫిట్ ల గురించి చంద్రబాబు భూమా రెడ్డి , శిల్పా రెడ్డి లకి చెప్పిన తరవాత కూడా భూమా నాగి రెడ్డి మళ్ళీ టీడీపీ లో తన మాట చెల్లు అవ్వాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని తెలుస్తోంది. దాంతో శిల్పా సోదరులు జగన్ దగ్గరకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. భూమా తో వారికి మొదటి నుంచీ ఉన్న ఆధిపత్య పోరులో భూమాది టీడీపీ లో పై చెయ్యి అవడం తో వారు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. నాలుగు నెలల లో చక్రపాణి ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగిసిపోతూ ఉండడం తో వారు భూమా కనుసన్నల్లో పనిచెయ్యాల్సి ఒచ్చేలా ఉంది.



త్వరలో దీనికి సంబంధించిన ఒప్పందం తీసుకుని బెటర్ అవడం కోసం ప్రయత్నించగా చంద్రబాబు శిల్పా సోదరులకి క్లాసు తీసుకున్నారు. రెండు రెండు సార్లు చంద్రబాబు తో భేటీ ఐన వీరు కలిసి పనిచెయ్యాల్సిందే అని హుకుం ని బాబు నుంచి అందుకున్నారు. దీంతో బ‌య‌ట‌కొచ్చిన ఇద్ద‌రూ  కర్నూలు జిల్లాలో పార్టీ కోసం, ప్రభుత్వం కోసం పని చేస్తామని చెప్పారు. శిల్పా సోదరులు మాట్లాడుతూ.. తమకు భూమాతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే ఇదే అదనుగా భూమా మళ్ళీ డామినేషన్ మొదలు పెట్టేలా కనిపిస్తూ ఉండడం తో చంద్రబాబు కి శిల్పా సోదరులు  ఝలక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: