ఓ సెక్స్ పిచ్చోడు సెల్ ఫోనే ఆయుధంగా రెచ్చిపోయాడు. ఆంధ్రా, తెలంగాణ పోలీసులకు పజిల్ గా మారాడు. మొబైల్ ద్వారా మహిళలకు ఫోన్లు చేస్తూ, బూతు మెసేజ్ లు, వీడియోలు పంపుతూ వేధించాడు. దాదాపు ఆరు నెలల పాటు 200 మంది వరకూ వివిధ వృత్తుల్లోని మహిళలను వేధించిన ఈ సెక్స్ మేనియా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 

మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. సందేశాలు పంపుతున్న ఓ యువకుడిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేశారు. రేపల్లెకు చెందిన కె.చిరంజీవిరావు అనే యువకుడిని అర్బన్ సీఐ బృందం అరెస్టు చేసింది. విచారణలో 200 మంది మహిళలను వేధిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చిరంజీవిని పట్టుకున్నారు.

ఆడాళ్లూ.. నెంబర్లు తెలియనివ్వకండి.. 


ఐతే.. ఆ సెక్స్ మేనియా తాను ఆడవాళ్లను ఎలా వేధించాడో వివరించే సరికి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంవాడు కావడంతో అటు తెలంగాణ మహిళలు, ఇటు ఆంధ్రా మహిళల్ని ఇద్దరినీ వేధించేవాడు. రెండు ప్రాంతాల్లోనూ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. మహిళల ఫిర్యాదులతో కదిలిన పోలీసులు ఎట్టకేలకు వలపన్ని ఇతన్ని అరెస్టు చేశారు. 

మరి ఇతడికి ఆ ఆడవాళ్ల పోన్ నెంబర్ ఎలా తెలిసేవి అనుకుంటున్నారా.. పని మీద పట్టణాలు, నగరాలకు వచ్చినప్పుడు అక్కడ కనిపించే మహిళలకు సంబంధించిన టైలరింగ్ షాపులు, బ్యూటీ పార్లర్లు, డిజైనర్ బోటిక్స్ వంటి వాటిపై ఉంటే ఫోన్ నెంబర్లు ఓ పుస్తకంలో రాసుకునే వాడు. ఆయా నెంబర్లకు తీరిగ్గా కూర్చుని ఫోన్లు చేసి వేధించేవాడు. మానసిక రోగం వల్లే చిరంజీవులు ఈ పని చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: