సాదారణంగా సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు బయటికి వెళ్లినపుడు డిన్నర్ చేయాలంటే ఆ డిన్నర్ ఖర్చు ఓ రేంజ్ లో ఉంటుంది..అలాంటిది అగ్ర దేశం అయిన అమెరికా అధ్యక్షుడు డిన్నర్ అంటే ఆ ఖర్చు ఓ రేంజ్‌లో వూహించకుంటాం కదా..! కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా డిన్నర్ ఖర్చు వింటే ముక్కుమీద వేలు వేసుకుంటారు.అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ వీధి హోటళ్లో డిన్నర్ చేశారు. మామూలుగా అయితే వేలల్లో ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఖర్చవుతుందని అనుకుంటారు.. కానీ... సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేసినా కూడా కేవలం రూ.400తోనే ఫినిష్ చేసేశారట.

డిన్నర్ చేస్తున్న ఒబామా


అసలు విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వియత్నాం పర్యటనలో భాగంగా సీఎన్ ఎన్ రిపోర్టర్ ఆంథోనీ బౌర్డియాన్ తో కలిసి హనోయిలోని ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారట. ఇద్దరూ కలిసి బీరు తాగి - నూడిల్స్ - సూప్ - గ్రిల్డ్ పోర్క్ వంటివన్నీ తిన్నారు. మొత్తం బిల్లు కేవలం ఆరు డాలర్లు మాత్రమే అయింది. అంటే సుమారు రూ.400 అన్నమాట.  

ఒబామాకు షేక్ హ్యాండ్ ఇస్తున్న చిన్నారి

చిన్న నీలిరంగు ప్లాస్టిక్ స్టూల్ పై కూర్చుని ఒబామా డిన్నర్ చేస్తున్న చిత్రాలను ఆంథోనీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రపంచం ఆశ్చర్యానికి లోనవుతోంది.ఒక్క‌సారిగా ఆ హోట‌ళ్లో ఒబామా ప్ర‌త్య‌క్షం అవ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు అత‌నితో కరచాలనం చేసేందుకు ఆస‌క్తి చూపుతూ ఫొటోలు కూడా దిగారు. అయితే ఈ హోట‌ల్ లో ఒబామా చేసిన డిన్న‌ర్ ఖ‌ర్చు కేవ‌లం ఆరు డాల‌ర్లు మాత్ర‌మే అంటూ ఆంథోని ట్విట్ చేశారు. తన పదవీ కాలం చివరి దశలో ఇలా ఒక సాధారణ జర్నలిస్టుతో రోడ్డు పక్క హోటల్లో భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: