ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ ఇప్పుడు భలే చిక్కు వచ్చిపడింది. చంద్రబాబుకు బంజారాహిల్స్ లో ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అప్పటివరకూ ఆయన మొదట్లో ఓ అద్దె ఇంట్లో ఉన్నారు.. కానీ అక్కడ నుంచి వివిధ కారణాలతో మదీనాగూడలో ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. కానీ అక్కడ నుంచి దూరం అవుతుందని బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో ఉంటున్నారు. 

అంతవరకూ బాగానే ఉంది. చంద్రబాబు ప్రజాధనంతోనే ఇలా స్టార్ హోటళ్లలో ఉంటున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మొదట్నుంచీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు స్టార్ హోటళ్లో ఫ్యామిలీని ఉంచుతూ మరింతగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు. ఓ పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులు త్యాగం చేయాలని మాట్లాడుతూ..మరో పక్క బాబు మాత్రం విచ్చలవిడిగా ప్రజధనాన్ని కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు.

ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు ఫ్యామిలీ.. 




మదీనాగూడ ఫాంహౌస్ కు మకాం మార్చిన చంద్రబాబు అక్కడ రూ. 2కోట్లు ఖర్చుచేశారని అంబటి విమర్శించారు. ఆ తర్వాత దాన్ని వదిలేసి  ఫైవ్ స్టార్ హోటల్ కు మకాం మార్చారని.. బాబుకు ఇళ్లే దొరకడం లేదా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ప్రజల సొత్తును  ఖర్చు చేసి మీరు, కుటుంబసభ్యులు, మీ పరిహారం ఫైవ్ స్టార్ హోటల్ లో నివాసముంటే...నీరో చక్రవర్తి మీరా మేమా అంటూ నిప్పులు చెరిగారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్ తో  కొట్టుమిట్టాడుతుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలన్న వ్యామోహంతో బాబు ఉండడం సిగ్గుచేటన్నారు.  విమానాల్లో విదేశాలు తిరుగుతారు. ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటారు. ఇళ్ల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అక్రమ కట్టడంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో నివసిస్తున్నారు. ఇలాంటి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే నమ్మాలా..? అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కుటీరంలో ఉండి ప్రజలకు ఆదర్శులుగా నిలిచారని అంబటి గుర్తు చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: