ఆంధ్రప్రదేశ్‌ కోటాలోని రాజ్యసభ స్థానాన్ని తెలంగాణలోని పార్టీ నేతలకు ఇచ్చే అవకాశం ఉందని గత కొద్ది కాలంగా పుకార్లు షికార్లు చేశాయి. ఇక రాజ్యసభ స్థానం కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు తెలంగాణ టీడీపీ నేతలు.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కోటాలోని రాజ్యసభ స్థానాన్ని తెలంగాణలోని పార్టీ నేతలకు ఇచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ టీటీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు. అలాగే రాజ్యసభ సీటు విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.

రాజ్యసభకు బలమైన ఆశావహులు ఏపీ నుంచి ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఆరోగ్యబీమా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రాజ్యసభకు తనను పరిగణలోకి తీసుకోవాలన్నారు ఆ సమయంలో  ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పారు.

అయితే, తెలంగాణ నేతలకు మాత్రం రాజ్యసభ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అంతకుముందు కూడా ఓసారి రేవంత్ రెడ్డి అధినేత చంద్రబాబుకు రాజ్యసభ విషయమై ఓ సూచన చేశారు. ఓ స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కానీ తెలంగాణ నేతలకు ఇచ్చేది లేదని లోకేష్ తేల్చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: