ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగితున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ జమనా వచ్చిన తీర్వాత కొందరు కామాందులు తాము అత్యాచారం చేసి అవి వీడియో తీసి మరీ యూట్యూబ్ లో వాట్సప్ లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇక భారత దేశంలో అయితే ప్రతిరోజు ఎక్కడో అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా బ్రెజిల్లో ఓ 16ఏళ్ల అమ్మాయిపై 30మంది మగాళ్లు విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. రాజధాని రియో డి జెనీరో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంటీటౌన్కు వెళ్లిన బాలికను గత గురువారం సాయుధులైన వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత ఆమెపై 30మంది అత్యాచారం చేశారు.
అంతే కాకుండా ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు బ్రెజిల్ సామాజిక మాథ్యమంలో కలకలం రేపాయి. అయితే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లగా మత్తుపదార్థాలు ఇచ్చి ఈ అకృత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పోలీసులు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.