తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మికంగా కురుస్తున్న వానలతో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. అకాల వర్షం తెలుగు రాష్ట్రాలకు అపార నష్టాన్నే మిగులుస్తుంది. ఇటీవల కురిసిన వానలతో వాతావరణం చల్లబడినా మళ్లీ ఎండలు పుంజుకున్నాయి. ఈ వేడి ద్వారానే అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

విశాఖ నగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరంలోని రహదారులు, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.విశాఖలో దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలు అలుముకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో రెండు మూడు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: