ప్రపంచంలో రోజు రోజుకీ మనిషి మానవత్వం మరిచిపోతున్నాడు. ఓ కవి అన్నట్లు ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్నట్లు బంధాలు బంధుత్వాలు అన్ని మరిచిపోతున్నాడు. ఆస్తి కోసం ఓ దుర్మార్గుడు తన తండ్రినే అతి దారుణంగా హత్యచేసి ఆపై శరీర భాగాలు ముక్కలు చేసిన వైనం కేరళలో చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులకు సైతం ఒల్లు జలధరించేలా కనిపించిన దృశ్యాలు చూస్తే అసలు అతడు మనిషేనా అన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..షెరిన్ జాన్ (36) ఐటీ హబ్‌లోని టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడి తండ్రి జాయ్ వి.జాన్ (68) ముప్పై యేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. వారం క్రితం సొంతూరికి వచ్చారని అనంతరం హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. అయితే జాయ్ వి.జాన్ చనిపోయే ముందు తన కొడుకుతో ఏసీ రిపేర్ చేయించడానికి వెళ్లినట్లు తర్వాత అతడు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాతు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు షెరిన్ జాన్ తమదైన స్టయిల్ లో అడగగా అసలు విషయం బయట పెట్టాడు.

షెరిన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి జాయ్ తల, కాలు, ఇతర అవయవాలు సేకరించారు మొత్తానికి కేసు మిస్టరీని ఛేదించారు. తన తండ్రిని తానే చంపానని అంగీకిరంచడంతో పోలీసులు షెరిన్ జాన్‌ను అరెస్టు చేశారు. తండ్రీకొడుకుల మధ్య ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: