ఈ మద్య మహిళలు చేస్తున్న కొన్ని కొన్ని వింత పనులు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది.  అయితే భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని పేపర్లో, మీడియాలో చూస్తూనే ఉన్నాం..వారికి రక్షణ కల్పించాల్సిందిగా మహిళా సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఇక చట్టం తన పని తాను చేసుకు పోతుంది. అయితే ఇప్పుడు భారత దేశానికి చెందిన ఓ మహిళ చేసిన పని చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు..అంతే కాదు ఓ రికార్డు కూడా స్థాపించారు. ఇంతకీ ఆవిడగారు చేసిన పని ఏంటా అనుకుంటున్నారా..!నగ్నంగా సైకిల్ తొక్కి రికార్డు నెలకొల్పింది.

వివరాల్లోకి వెళితే.. ఒక భారతీయ మహిళ నగ్నంగా సైకిల్ తొక్కి ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకోవడమే కాదు ఏకంగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. మీనాల్ జైన్ అనే మహిళ లండన్లో ఓ ఐటీ కంపెనీ నడుపుతోంది. ఇటీవల మెల్బోర్న్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ నిర్వహించింది.  అయితే ఈ ర్యాలీలో చాలా మంది మహిళలు పురుషులు పాల్గొన్నారు. ఇలా నగ్న ర్యాలీలో పాల్గొన్న తొలి భారతీయురాలిగా మీనాల్ రికార్డులకెక్కింది. అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడు నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుందట.

బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట.  అంతే కాదు లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ను నడుపుతూ అందులో నగ్నత్వం గురించి సంక్షిప్తంగా ప్రచారం చేస్తుందట. అంతే కాదు ఇందులో మీనాల్ వేదాంతం చెబుతూ..పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ నడుమ ఎందుకు అనడంతో చాలా మంది ఈమెను ఫోలో అవుతున్నారని చెబుతుంది.  మొత్తనికి నగ్నంగా ర్యాలీలో పాల్గొని రికార్డు స్థాపించినందుకు సంతోష పడే వారు కొందరు ఉంటే..  భారతీ సాంప్రదాయాలను, కట్టుబాట్లను తుంగలో తొక్కినందుకు విమర్శిస్తూ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: