ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో సీఎంగా ప్రజల మన్ననలు అందుకున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృత్యువు ఎంతో మందిని కలిచి వేసింది. ఆ సమయంలో తెలుగు ప్రజల చాలా మంది కుంగి పోయారు..ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే వారిని ఓదార్చే మనిషి ఒకరు ఉన్నారని తెలియజెప్పుతూ తండ్రి బాటలో కొనసాగుతూ వచ్చారు ఆయన తనయులు వైసీపీ అధ్యక్షులు వైఎస్.జగన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రజాపక్షాన నిలబడుతూ ప్రజలకు అన్యాయమైన ప్రతిచోట నేనున్నానంటూ ప్రత్యక్షమవుతున్నారు.
అయితే రాజకీయంగా ఎన్నో సమస్యలు ఉన్నా తమకంటూ ఓ కుటుంబం ఉంటుంది..గతంలో వైఎస్ బతికి ఉన్న రోజుల్లో తన కుటుంబంతో విదేశాల్లో కొన్ని రోజులు గడిపి వచ్చే వారు. తాజాగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన కుటుంబంతో లండన్ వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయన మార్క్ మాత్రం పోనివ్వలేదు..పార్టీ అయినా.. ఆటయినా.. అంతా నాఇష్టం. ప్రతి ఆటకో డ్రెస్కోడ్ ఉంటుంది. అయితే అది అందరికేగానీ.. తనకు మాత్రం రూల్స్ వర్తించవన్నట్టు గోల్ఫ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ జగన్ని ఇలా చూడనివాళ్లు కూడా ఆయన్ని చూసి షాకయ్యారు.
ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ గేమ్స్లో గోల్ఫ్ ఒకటి అన్న సంగతి తెలుసు. గోల్ఫ్ ప్లేయర్స్ చెప్పేదేంటంటే కాటన్ ప్యాంట్, టీషర్ట్ వేసుకోవాలన్నది దీనికి డ్రెస్కోడ్ అని అంటున్నారు. కానీ, జగన్ మాత్రం రూల్స్ని తుంగలోకి తొక్కేసి మరీ జీన్స్ వేసుకుని ఆటాడేశారు. ఇక జగన్ ఆట చూసి వావ్ అంటున్నవారు కొందరుంటే..అక్కడ కూడా ఆయన రూల్స్ పాటించలేదా? అంటూ ఆ పిక్స్పై మరికొందరి కామెంట్లు చేస్తున్నారు.