నవ్యాంధ్ర నూతన రాజధానిలో భూమి మూడు అడుగుల మేర కుంగిపోయిందంటూ వెలువడ్డ వార్తా కథనాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఫైరయ్యారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటవుతున్న వెలగపూడిలో భూమి మూడు అడుగుల మేర కుంగిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని మీడియా వార్తలు ప్రసారం చేసింది. 



దీనిని ప్రస్తావిస్తూ అమరావతికి వచ్చి, అక్కడి పరిస్థితులను పరిశీలించి వార్తలు రాస్తే ఓకే గాని, ఇంటిలో కూర్చుని తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. సదరు వార్తా కథనాలను రాస్తున్న మీడియా ప్రతినిధులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవహరిస్తారని భావిస్తున్నానని పేర్కొన్న ఆయన... లేని పక్షంలో అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు.



ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని, లేనిపక్షంలో అలాంటి వారిని ఎలా డీల్‌ చేయాలో తమకు తెలుసని హెచ్చరించారు. 35 ఏళ్లపాటు హైదరాబాద్‌తో ఉన్న సంబంధం తెంచుకుని ఉద్యోగులు ఇక్కడికి వస్తున్న తరుణంలో వారిని ఆందోళనకు గురిచేసేలా వార్తలు రాయడం సరికాదని చెప్పారు. రైలును తగులబెట్టిన వారిని కూడా అరెస్టు చేయొద్దని కొందరు డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని బాబు ప్రశ్నించారు. కొందరు నాయకులు కూడా దీనికి మద్దతిస్తున్నారని, కొన్ని పత్రికలు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. రైలును కాల్చేసిన వారిని కూడా అరెస్టు చేయొద్దంటే.. సామాన్యులకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: