కొంత మంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి..ముఖ్యంగా సెలబ్రెటీలు చేసే పనులు ఈ మద్య ప్రచార మాద్యమాల్లో సంచలనాలే సృష్టిస్తున్నాయి. మొన్నటి మొన్న హీరో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రం గురించి మాట్లాడుతూ..షూటింగ్ సమయంలో రింగ్ నుంచి బయటకు వస్తే తాను రేప్ చేసిన మహిళ పడే అవస్థగా ఫీల్ అవుతున్నానని వ్యంగంగా మాట్లాడటం పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో యావత్ భారత దేశం మహిళా లోకం ఉవ్వేత్తున లేచింది..రేప్ చేసిన మహిళలంటే సల్మాన్ కి అంత చులకనా..వారు పడే ఆవేదన ఆయనకు అంత నీచంగా కనిపించిందా అంటూ తిట్లదండకం మొదలు పెట్టారు. కొంతమంది అయితే ఏకంగా కేసులే పెట్టారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే కొన్ని వింత వింత పనులు చేస్తూ భలే బుక్ అవుతుంటారు.

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఇప్పటికే ఓ వాచ్ విషయం గురించి గోల గోల చేయగా..మొన్నటి మొన్న ఓ కాకి వాలిందని తన కారునే మార్చారు. తాజాగా సిద్ధరామయ్య బుగ్గలపై ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగింది. సిద్దిరామయ్య  కురుబా కులానికి చెందిన వ్యక్తి కావడంత అభిమానంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్‌మగ్‌లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను ఆయన సన్మానించారు. సన్మానం ముగిసిన వెంటనే ఆమె ఆయన కుడిబుగ్గపై ముద్దుపెట్టారు.  అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..అసలే వివాదాల్లో ఉండే సిద్దిరామయ్యకు ఈమె కాస్త ముద్దు పెట్టడం అదికూడా పబ్లిక్ గా అని అందరూ చెవులు కొరుకున్నారు.

ఆ సమయంలో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు. తర్వాత ఈ ఘటనపై ఆయన స్పందించేలోగా ఆమె వేదిక నుంచి దిగిపోయారు.  ఈ కార్యక్రమంల అయిన తర్వాత ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు ఆయనను నేను తొలిసారి కలిశాను ఆ గౌరవం..సంతోషంతోనే ఆయనకు ముద్దుపెట్టాను ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. అంతే కాదు తనకు తనకు పెళ్లి అయిందని ఆమె తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: