రాజకీయ కక్షలు వ్యక్తిగత దాడులకు కూడా దారి తీస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఓ మహిళానేతపై కక్షతో ఏకంగా ఓ మంత్రిగారే ఆమెపై అత్యాచారయత్నం చేయించిన సంఘటన కలకలం రేపుతోంది. నిందితుడు ఇచ్చిన వాగ్మూలం విని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్నంబజారులో ఉంటున్న వైసీపీ నాయకురాలు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ రేవతిపై ఇటీవల అత్యాచార యత్నం జరిగింది. నేరుగా ఆమె ఇంటికే వచ్చిన వీరనారాయణ అనే వ్యక్తి.. ఆమెను రేప్ చేయబోయాడు. అంతేకాదు.. డబ్బు ఆశ చూపి లొంగదీసుకోవాలని చూశాడట. అయితే ఆమె ప్రతిఘటించడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. 


రేవతి గట్టిగా కేకలు వేసి అందర్నీ పిలవడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో సదరు వీరనారాయణ ఆశ్చర్యపోయే వాస్తవాలు వెల్లడించాడు. రేవతిని రేప్ చేయమని సాక్షాత్తూ ఓ మంత్రిగారే తనను పురమాయించారని చెప్పాడట. 

నెల రోజుల క్రితం స్వయంగా మంత్రిగారే పిలచి.. తనకు ఈ క్రైమ్ టాస్క్ అప్పగించారని వీరనారాయణ చెబుతున్నాడు. వీరనారాయణ వెల్లడించిన ఆ సదరు మంత్రిగారు ఎవరనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ పోలీసులు ఆ పేరును బయటకురానివ్వడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: