హీరోయిన్ నీతూ అగర్వాల్ గుర్తుందా.. నీతూ అగర్వాల్ అంటే వెంటనే గుర్తురావడం కష్టం. కానీ స్మగ్లింగ్ హీరోయిన్ అంటే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లర్ మస్తాన్ వలీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత తాను కూడా స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుపోయిన సినిమా హీరోయినే ఈ నీతూ అగర్వాల్. మళ్లీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. 

హైదరాబాద్ లోని బీరంగూడలో నీతూ అగర్వాల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. తన కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని కంటనీరు పెట్టుకుంది. మస్తాన్ వలీతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తమ బంధువుల్లో వరుసకు సోదరులైన ముగ్గురుని పోలీసులు అరెస్ట్‌ చేసి జైళ్లలో పెట్టారని సినీహీరోయిన్‌ నీతూ అగర్వాల్‌ చెబోతోంది. 


తనకు ఎటువంటి సంబంధం లేని కేసుల్లో తన బంధువులను అక్రమంగా ఇరికిస్తున్నారని నీతూ అగర్వాల్ ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో తమ జీవితాలు ఏమవుతాయో తెలియకుండా ఉందని నీతూ తెలిపారు.

అలాగే మస్తాన్ వలీతో తన సంబంధం గురించి కూడా నీతూ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. మస్తాన్‌వలీకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసిన వెంటనే తాను విడిపోవడం జరిగిందని తెలిపారు. సినీజీవితంపై మమకారం పెంచుకుని వేసిన ఒకటి, రెండు తప్పటడుగులు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పేందుకు ఈ నీతూ అగర్వాల్ ఉదంతం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో..



మరింత సమాచారం తెలుసుకోండి: