చెన్నైలోని ఐఐటి మద్రాసు క్యాంపస్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పపడటంతో అంతా షాక్ కి గురయ్యారు. వీరిద్దరు కూడా వివాహిత మహిళలు కావడం గమనార్హం. ఈ ఇద్దరు మహిళలు కేవలం మానసిక వొత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కడలూరుకు చెందిన మహేశ్వరి (32) అనే మహిళకు వివాహమై భర్త, ఆరేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా భార్యా భర్తల మద్య గొడవ జరుగుతుందని తెలుస్తుంది..దీనికి కారణం బిడ్డ బాగోగులు చూసుకోకుండా చదువేంటని భర్త మందలించాడు.
దీంతో మహేశ్వరి చిన్నబుచ్చుకుని ఆత్మహత్య చేసుకుంది. మద్రాస్ ఐఐటీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేషన్ భార్య విజయలక్మీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమారులు అయితే వారిలో చిన్నకుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం ఎంతో మంది వైద్యులకు చూపించినా బాగుపడకపోవడంతో చాలా రోజుల నుంచి ఈమె కూడా మానసికంగా కృంగిపోయింది.
కలత చెందిన విజయలక్ష్మి కుమారుడి ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ప్రతిష్టాత్మక మద్రాస్ ఐఐటీలో ఒకే రోజు ఇద్దరు మహిళలు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.