ఆయనో ప్రజాప్రతినిధి.. కానీ కామాతురాణాం నభయం.. న లజ్జ అంటారు కదా.. అలాగే ఓ బాలికపై అతని కన్ను పడింది. అందులోనూ రైల్లో ప్రయాణిస్తూ కూడా ఓ బాలికను చెరచబోయాడు. పోలీసులచ చేతికి చిక్కిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లో రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన టూనాజీ పాండే అనే బీజేపీ ఎమ్మెల్సీను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు హజీపూర్ లో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్లో బాలిక నిద్రిస్తున్న సమయంలో టూనాజీ అత్యాచారానికి ప్రయత్నించారని వివరించారు.
రైల్లో నిద్రస్తున్న బాలికపై కన్నేసిన పాండే.. ఆమెను బలవంతంగా మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడట. ఆమె గట్టిగా కేకలుపెట్టడంతో బాలిక తండ్రి అలర్టయ్యాడట. పాండే చేష్టలను అడ్డుకున్నాడట.
ఐతే.. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన టూనాజీ.. ఫోన్ చార్జర్ తీస్తున్న సమయంలో బాలిక అరుపులు ప్రారంభించిందనీ... అక్కడ పడుకుంది ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. టూనాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తునట్టు బీజేపీ బీహార్ నాయకత్వం ప్రకటించింది.