దేవుడి పేరు చెప్పి నాలుగు మంచి మాటలు చెబితే చాలు.. జనం ఊరికే నమ్మేస్తారు. వారిని నెత్తిన పెట్టుకోవడం మొదలుపెడాతారు. అలాంటి వారే నమ్మినవారి గొంతు కోస్తారు. తాజాగా అలాంటి సంఘటనే విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.

విజయనగరం జిల్లా మోదవలసలో రెసిడెన్సియల్ బైబిల్ యూనివర్సిటీ ఉంది. దీని జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు యుక్తవయస్సుకొచ్చిన అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడట. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ రూమ్ లోకి పిలిపించుకుని వెకిలి వేషాలు వేస్తున్నాడట.


ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కాస్తో కూస్తో అందంగా ఉన్న అమ్మాయిలందరితోనూ ఇలాగే చేస్తున్నాడట. బైబిల్ చదువు చదువుకుందామని వచ్చిన అమ్మాయిలంతా ఈ మదపిచ్చి డైరెక్టర్ దెబ్బకు బెదిరిపోయారు. జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పుకున్నారు.   

దీంతో తల్లిదండ్రులంతా... తమ పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ప్రసన్నబాబుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  దైవం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుడికి బుద్ది చెప్పాలని కోరుతున్నారు.డెంకాడ మండలంలోని ఈ బైబిల్ కళాశాలలో ఐదు సంవత్సరాల కోర్సును నిర్వహిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: