అదృష్టం అంటే అతడిదే. కేవలం 3వేల రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా ఓ ఐలండ్ రిసార్ట్ అతడికి బహుమతిగా వచ్చేసింది. అది కూడా అలాంటిది, ఇలాంటిది కాదు.. పగడాల దిబ్బలు, గుహలు, మంచి అడవులు.. ఇవన్నీ ఆ దీవిలో ఉన్నాయి. అదృష్టం కలిసిరావడంతో కోట్ల రూపాయల విలువైన, అందమైన రిసార్ట్‌ను లాటరీలో గెలిచేసుకున్నాడు ఈ ఆస్ట్రేలియా వ్యక్తి. వివరాల్లోకి వెళితే..


ఆస్ట్రేలియాకు చెందిన డోగ్, సల్లీ బీట్జ్ దంపతులు మైక్రోనేసియాలో ఉన్న కాస్రాయ్ ద్వీపాన్ని ఓ సారి టీవీలో చూశారు. అక్కడి అందాలకు ముగ్ధులైపోయిన వారు 1994లో అక్కడో రిసార్ట్‌ను నిర్మించుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఈ రిస్టార్ట్‌లో మొత్తం 16 గదులున్నాయి. అందులో నాలుగు బెడ్రూంలు, మేనేజర్ ఉండేందుకు ఓ గది, రెండు సెల్ఫ్-కంటెయిన్‌డ్ సింగిల్ బెడ్రూం అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న డోగ్ దంపతులు ఇప్పుడు ఈ రిసార్ట్‌ను ఖాళీ చేసి ఆస్ట్రేలియా వెళ్లిపోవాలని భావించారు.

3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!

దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రిసార్టును ఎవరైనా బాగా ప్రకృతి ప్రేమికులకు ఇవ్వాలని వాల్లు అనుకున్నారు. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాకుండా.. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించే వాళ్లయితే మేలని భావించారు. దీనికి సంబంధించి కథనాన్ని ఓ వెబ్సైట్లో చూసిన జోషువా.. మూడు టికెట్లు కొన్నాడు. అనుకోకుండా అతడికి లాటరీ తగిలేసింది. దాంతో అతడి ఆనందానికి అంతూ పొంతూ లేదు. ఐలండ్ రిసార్టు యజమానులు డౌగ్, సాలీలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు. కాగా, ఈ ఐలండ్ రిసార్ట్ గెలుచుకోడానికి లాటరీ నిర్వహించగా.. మొత్తం 75,485 టికెట్లు అమ్ముడుపోయాయి.150 దేశాలకు చెందినవాళ్లు వీటిని కొన్నారు. ఒకో టికెట్ను రూ. 3వేల చొప్పున అమ్మారు. ఎక్కువ టికెట్లు కొంటే డిస్కౌంటు కూడా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: