ప్రపంచంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా నశించి పోతున్నదని చెప్పడానికి ఎన్నో సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వార్తలో మహిళలపై చిన్నారులపై కూడా కొంత మంది కామాంధులు రెచ్చిపోయి మరీ అఘాయిత్యాలు చేయడమే కాకుండా హత్యలు కూడా చేస్తున్నారు. ఇక కొంత మంది తల్లి తనం కించపరిచే విధంగా తమ బిడ్డలను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. మరో వైపు అక్రమ సంబంధాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపేసి.. రాత్రంతా శవాల పక్కనే పడుకుని నిద్రపోయాడు. ఈ ఘటన తిరునెల్వేలి జిల్లాలో వెలుగు చూసింది. రాజశేఖరన్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.  గత కొంత కాలంగా తన తనకూ తన భార్యకు మద్య విభేదాలు రావడం రోజూ గొడవలు కావడంతో బాగా మద్యానికి అలవాటు పడ్డాడు. బుధవారం రాత్రి అదేవిధంగా పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.

తరువాత భార్య మేఘలతో గొడవ పెట్టుకున్నాడు. చివరికి భార్య గొంతునులిమి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన మేఘల దగ్గరలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది.  భార్య మీద కోపంతో నిద్రపోతున్న ముగ్గురు పిల్లలను నిద్రలేపాడు. కూల్ డ్రింక్ లో విషం కలిపి బలవంతంగా తన ముగ్గురు పిల్లలకు తాగించాడు. విషం తాగిన పిల్లలు ఒకరి తరువాత ఒకరు మరణించారు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖరన్ పిల్లల శవాల మధ్యలో నిద్రపోయాడు.  తెల్లవారి జామున లేచి చూసేవరకు పిల్లలు ముగ్గురు  విగతజీవులై పడివున్నారు.  

అప్పుడు తెలిసింది రాత్రి తాను మద్య మత్తులో పిల్లలకు విషయం ఇచ్చినట్లు దీంతో తాను చేసిన పాపం తనకు చుట్టుకుంటుందని భావించిన  రాజశేఖరన్ బ్లేడుతో తన చేతిని కోసుకొని కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. ఆ భాద భరించలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి  రాజశేఖరన్ రక్షించారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. రాజశేఖరన్ పూర్తిగా కాలిపోయి మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: