ప్రపంచంలో కొంతమందికి అదృష్టం అనేది అనుకోకుండా వస్తుంది..మరికొంత మందికి అదే అదృష్టం వచ్చినట్లే వచ్చి చే జారిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం తన వైపునకు తిప్పుకున్న అమ్మాయి పివి సింధూ..రియో ఒలంపిక్స్ లో వెండి పతకం గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు యావత్ భారత దేశం కొనియాడుతుంది. అంతే కాదు తెలుగు రాష్ట్రాలు సిందూని తమ సొంత బిడ్డలా ఆదరించింది..గౌరవించింది. రియో నుంచి తిరిగి వచ్చిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికింది. ఈరోజు విజయవాడలో కూడా పివి సింధుని నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు.
Image result for sindhu kcr
ఈమెకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కాసుల వర్షం కురిపించి వెయ్యి గజాల స్థాలన్ని ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అయితే రూ. 3 కోట్లు బహుమానంగా ప్రకటించి రాజధాని అమరావతిలో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. అంతే కాదు గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. ఏది ఏమైనా ఇప్పుడు భారత దేశం మొత్తం సింధూ గురించి టాక్..దీంతో ఈ అమ్మడి ఇమేజ్ క్యాష్ చేసుకోవాలని చిన్నగా కార్పోరేట్ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది.
Image result for sindhu chandrababu
గతంలో సానియా మిర్జా, నైనా సెహ్వాల్ లాంటి వారితో యాడ్స్ చేయించి కోట్లు కుమ్మరించాయి.  ప్రస్తుతం సింధూకి కాస్త విశ్రాంతి దొరకడంతో తన వాళ్లతో కలిసి తెలుగు డైలాగ్స్ డబ్ స్మాష్ చేసింది.  సెలబ్రెటీస్ ఏం చేసినా అదో పెద్ద వార్తే కాదా..దీంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.  ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: