హీరోలు అంటే అభిమానం చాటుకునే వారు ఈ మద్య ఆ అభిమానం కాస్త వివాదాలుగా మారుతున్నాయి. గతంలో పవన్ కళ్యాన్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్య భీమవరంలో పెద్ద గడవ జరిగింది. ఆ సంఘలనలో పవన్ తన ఫ్యాన్స్ ని మందలించడం కూడా జరిగింది. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లతో మహేష్ బాబు, పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మద్య మరోసారి గొవడలు జరిగాయి.  నాలుగు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లో మ‌రో హీరో అభిమాని చేతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయల్ హ‌త్య‌కు గురి కావ‌డం ఇప్పుడు పెద్ద సంచలనమే రేపింది. ఇక బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాన్ ఈ విషయంపై చాలా ఆవేదన చెందాడు. అంతే కాదు చనిపోయిన వినోద్ ఇంట్లో గతంలో మెగాస్టార్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాలు ఉండటాన్ని చూసి ఆయనకు తమ కుటుంబంపై ఉన్న ప్రేమకు చలించిపోయారు.
Image result for pawan kalyan at tirupati
సినిమా ఇండస్ట్రీలో హీరోలు అందరూ కలిసి మెలిసి ఉంటారని ఎవరి మద్య ఈగో ఫీలింగ్స్ లేవని అలాంటపుడు ఫ్యాన్స్ ఎందుకు గొడవ పెట్టుకోవడం అని ప్రశ్నించారు. అభిమానం అనే ఉన్మాదంతో ఒకరి హత్య చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. ఇక కాగా   కర్ణాటక పోలీస్ లు ఈ కేసులోని ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 21 న వీరిద్దరికి తన అభిమాన హీరో ల విషయంలో జరిగిన గొడవ వినోద్ రాయల్ హత్య కు కారణంగా తెలుస్తోంది. వినోద్ హత్య తర్వాత తప్పించుకు తిరుగుతున్న నిందితుడు అక్షయ్ కుమార్ ను కర్ణాటక పోలీస్ లు నరసాపురం సమీపం లోని నందిని డాబా దగ్గర అరెస్ట్ చేశారు. కాగా ఈ హత్య కేసులో మొత్తం 7 మంది నిందితులు ఉన్నట్లు పోలీస్ లు ఆధారాలు సేకరించారు. అక్షయ్ కుమార్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీస్ లు తెలిపారు.


అంతే కాదు గత కొంత కాలంగా వినోద్, అక్షయ్ మంచి స్నేహితులుగా నే ఉండే వారని అలాంటిది వీరి మద్య కేవలం హీరో అభిమానాలే హత్య చేయడానికి పురిగొలిపాయా లేదా వేరే ఇతర కారణం ఏదైనా ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ముగ్గురు నింధితులు తప్పించుకున్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: