ప్రపంచంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే షాక్ కి గురి కావాల్సిందే..ముఖ్యంగా మనిషి రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా లొంగిపోతుంటారు..అదే దైవానికి, దెయ్యానికి. దైవం అంటే ఎంత భక్తి ఉంటుందో..దెయ్యం అంటే అంత అదురు. అయితే ప్రపంచలో దెయ్యాలు, దేవుళ్లు నమ్మని వారు కూడా ఉన్నారు. కానీ వారిని వితండ వాదులుగా చూస్తుంటారు. తాజాగా 300 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ పాప అకస్మాత్తుగా కళ్లు తెరిచి చూడటంతో అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు పెడితే ఒక ఔత్సాహికుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

ఇంకేముంది అది కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..300 సంవత్సరాల క్రితం శాంతా ఇనోసెన్సియా అనే చిన్నారికి ఏసు క్రీస్తు అంటే వల్లమాలిన భక్తి ఉండేదట. దీంతో ఆ పాప చిన్ననాడే నన్‌గా మారిపోవాలని నిర్ణయించుకుందట. అది కాస్త తెలుసుకున్న పాప తండ్రి ససేమిరా అనడంతో ఇల్లు వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ఆమె తండ్రి దారుణంగా కొట్టడంతో   ప్రాణాలు కోల్పోయింది.

దీంతో క్రీస్తు భక్తికి చిహ్నంగా ఇనోసెన్సియా భౌతిక కాయాన్ని చర్చిలోనే ఉంచాలని మత పెద్దలు నిర్ణయించారు. శరీరం కుళ్లిపోకుండా వివిధ రసాయనాలతో గాజు పెట్టెలో ఉంచారు. చాలా మంది ఆ చర్చికి వెళ్లి పాపను చూస్తుండటం ఆనవాయితీగా మారిపోయింది.  తాజాగా  ఆ మృతదేహం కళ్లు తెరిచి చూసింది. దీంతో అందరి గుండె గుభేలుమంది. తాజాగా ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇనోసెన్సియా కళ్లు తెరిచి చూసేందుకు గల స్పష్టమైన కారణం మాత్రం తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: