సాధారణంగా మనం స్నేహితుల గురించి ఎన్నో సినిమాల్లో చూశాం..చూస్తూనే ఉన్నాం. అయితే నిజ జీవితంలో కూడా కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు..అంతే కాదు ఒకరికోసం మరొకరు ప్రాణాలు ఇచ్చేంత స్నేహితులు కూడా ఉంటారు. అయితే ఓ స్నేహితుడు నిజంగానే తన కళ్ల ముందే తన స్నేహితుడు చనిపోవడాన్ని తట్టుకోలేక తన ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాలలోకి వెళితే.. కూకట్పల్లి మూసాపేటలో బైక్ పై వెళుతున్న ఘంటా హరికృష్ణ, కె.రమేశ్ అనే యువకులకి యాక్సిడెంట్ జరిగింది.
బైక్ పై వెనుక కూర్చున్న హరికృష్ణ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. తన ప్రాణస్నేహితుడి మరణాన్ని చూసితట్టుకోలేక రమేశ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కనే ఉన్న భరత్ నగర్ లో పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.స్నేహితుడి లేని జీవితం తనకెందుకనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి అమీర్ పేటలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మూసాపాటలోని గూడ్స్ షెడ్ రోడ్డులో బైక్పై వెళ్తున్న ఇద్దరు స్నేహితుల వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదం బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమీపంలో చోటు చేసుకంది. హరికృష్ణ హైదరాబాద్ లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు.. రమేశ్ (28) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గుంటూరు జిల్లాలోని కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.