ఇరు దేశాల మద్య ఉన్న నియంత్రణ రేఖ - లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్య మంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించింది. యూరీ ఉగ్రవాదదాడి నేపథ్యంలో తొలిసారి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం దాదాపు ఎనిమిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ముప్పై ఎనిమిదిమంది కరుడుగట్టిన  ఉగ్రవాదులను మట్టికరిపించిన విషయం తెలిసిందే.

Image result for ranbir singh DGMO & Rajnath singh

ఈ దాడి జరిగిన తర్వాత  "డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్"  (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు.  అనంతరం ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి తాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో?  కారణాలు చెప్పడంతోపాటు తాజాగా జరిపిన దాడి గురించి ఆర్మీ తరుపున ఆయా ముఖ్యమంత్రుల కు అగ్రనేతలకు చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ దాడి వివరాలను తెలియజేశారు. సైన్యం చెప్పిన వివరాల ప్రకారం సైన్యం ఆపరేషన్ ను ఎలా నిర్వ హించిందంటే: 

Image result for ranbir singh DGMO & Rajnath singh

యూరీ ఉగ్రవాదదాడి చేసేందుకు ముందు పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్నారు.

యూరీ ఉగ్రవాదదాడి లో నలుగురు ఉగ్రవాదులే మాత్రమే హతమయ్యారు. దీని ప్రకారం మరింత మంది ఉగ్రవాదులు సమీప ప్రాంతంలోని ఉన్నట్లు సమాచారం అందింది.

యూరీ ఉగ్రవాదదాడి అనంతరం వారం రోజుల ముందే భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది.


ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా మరోసారి దాడి చేయొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో బదులు చెప్పాలని నిర్ణయించుకున్న సైన్యం నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు కదిలాయి.


వివిధ సెక్టార్లలోని ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.


ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భారత ఆర్మీపారాకమాండోస్‌, హెలికాప్టర్లను ఉపయోగించారు. బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించారు.
ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్ లో వారి ఉగ్రవాద శిబిరాలకు భారీ నష్టం చోటుచేసుకుంది.


దాదాపు అజాద్ కాస్మీర్ కు చెందిన 38మంది ఉగ్రవాదులు హతమైనారు. మరికొందరిని బందీగా తీసుకున్నారు.


ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యర్ధుల నుంచి లభించిన ఆయుధాలు అన్నీ కూడా పాక్ కు చెందినవని గుర్తించారు. ఈ దాడిలో హతమైనవారు పాక్ ప్రాంతానికి, పాక్ ఆక్రమితి కశ్మీర్ కు చెందినవారని తెలిసింది. కేవలం ఉగ్రవాదులే కాకుండా వారికి దారి చూపించేవారు, శిబిరాల నిర్వాహకులు కూడా ఉండటంతో ఎక్కువమంది గాయపడ్డారు.

ఈ దాడిలో హతమైన వారంతా జమ్మూకశ్మీర్ తోపాటు ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Image result for pok images

అంతేకాదు ఇద్ధరు పాకిస్థాన్  సైనికులు హతమైనట్లు పాకిస్థాన్ దృవీకరించినట్లు వార్తలొచ్చాయి. అంటే ఉగ్రవాదులకు సైనికుల సహకారం ఉన్నట్లేకదా! 

మరింత సమాచారం తెలుసుకోండి: