పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కర మూకల దురాగతాలకు హద్దేలేకుండా పోతోంది జమ్ము కాశ్మీర్ రాష్ట్రములో. అత్యంత క్రూరంగా ప్రవర్తించే పాకిస్థాని ఉగ్రమూకలకై ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా పట్టణంలో భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలు కశ్మీర్ పోలీసులతో కలసి సంయుక్తంగా తొలిసారి కార్డెన్ సెర్చ్ శక్తివంతంగా నిర్వహించింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ దాడుల్లో అనేక ఇళ్ళ నుండి పెద్దమొత్తములో పెట్రోల్ బాంబులు, పాకిస్థాన్, చైనా జాతీయ జెండాలు, ఆ రెండుదేశాల ఉగ్రవాద సాహిత్యం లభించాయి.