భారత సైన్యం రక్తంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ విమర్శించారు. భారత సైనికుల త్యాగాలు, పాకిస్తాన్తో కయ్యం గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఆ పార్టీకి లేకుండా పోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దీనిని ప్రచార అస్త్రంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు.