ఏదో అనుకుని వెళ్తే మరేదో అవుతుంది.. అలాంటి సందర్భాలు చాలా సార్లు ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు.. ఇలాంటి సీనే వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆందోళనకారులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.