గాలి జనార్థన్ రెడ్డి.. బహుశా ఈ పేరు తెలియనివారుండరేమో..! ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేతగా ఈయన సుపరిచితం. బళ్లారి కేంద్రంగా ఈయన మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. వై.ఎస్.హయాంలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంకోసం కడపలో భూములను కూడా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు ఆయన్ను జైలుకు పంపించాయి.