బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనయుడు వరుణ్ గాంధీ మాయలేడి వలలో చిక్కాడట. ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మ వేసిన హానీ ట్రాప్ ఉచ్చులో చిక్కిన వరుణ్ రక్షణ శాఖ రహస్యాలను అతడికి లీక్ చేస్తున్నారట. అమెరికాకు చెందిన ఎడ్మండ్స్ అలెన్ అనే ప్రజావేగు ఈ విషయమై సెప్టెంబర్ 16న ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆధారాలుగా చూపుతూ, ఓ సీడీతోపాటు, భారీగా ఫొటోలను కూడా అతడు పీఎంవోకు పంపాడు. ఈ విషయమై ఎకనమిక్ టైమ్స్ వరుణ్ గాంధీని ప్రశ్నించగా, ఈ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ బదులిచ్చారు.