ఒక్కప్పటి రాజరీకపు వ్యవస్థలో దేశాన్ని పాలించే రాజు పదవి విరమణ చేస్తే మళ్లీ అతని కుమారుడో, కూతురో, లేక వారి వారసత్వంలో ఎవరో ఒకరు రాజు కావాల్సి ఉంటుంది. ఇది అప్పటి రాజరీకపు, ప్యూడల్ వ్యవస్థ. కానీ తాజాగా మనం ఆ రాజరీకపు వ్యవస్థకు స్వస్థి పలికి, ప్రజలే పాలకులుగా ప్రకటించుకున్నాం. మన కంటూ ఓ ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించుకున్నాం. ప్రజల అభిష్టం మేరకు ఎవరు పాలిస్తారో వారే ఇప్పుడు రాజు.