ఉత్తర్ప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పార్టీలోని సంక్షోభం లావాలా బద్దలైంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే.. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతగా ముదిరిపోయాయి. పార్టీలో పరిస్థితులపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ములాయం సింగ్ ఈ రోజు సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభానికి ముందు ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ మద్దతుదారులు, తిరుగుబాటు దారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.