రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని విషయాల్లోనూ పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిని మించి మరొకరు అభివృద్ధి పనుల్లో పోటీ పడుతూ రాష్ట్రాలను ప్రగతి పథంలో నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలు, తిరస్కరణలు ఎదురవుతున్నా వాటిని లెక్క చేయకుండా తామనుకున్న పని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఇద్దరు చంద్రులు.