ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులే సీఎం కేసీఆర్కు ఘోరీ కడతారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం ఎన్ ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి గర్జన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు అందరూ బాగుండాలె.. తెలంగాణ బిడ్డలు (విద్యార్థులు) ఏం పాపం చేశారు..