మావోయిస్టుల ఏరివేత పేరిట ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని ముందుకు పోతున్న గ్రేహౌండ్ పోలీసులు... మావో అగ్రనేతలు అక్కిరాజు హరగోపాలు అలియాస్ రామకృష్ణ, గాజర్ల రవిలను టార్గెట్ చేసుకుని ముందుకుపోతున్నారా...? ఇంతకీ వారిద్దరు పోలీసుల ఆధీనంలోనే ఉన్నారా? సమయం చూసి కథకు ముగింపు పలకాలని చూస్తున్నారా? అంటే తాజా పరిస్థితులు అవుననే వాదనలు వినబడుతున్నాయి.