రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న వేళ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. టార్గెట్ 2018 కాన్సెప్ట్ తో పనుల్లో వేగం పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్నే వేదికగా చేసుకున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు.. ఈ నెల 28న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిపించాలని నిర్ణయించారు.