ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. రాజధానిని 9నగరాలుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చంద్రబాబు సర్కార్.. తొలి నిర్మాణానికి అంకురార్పణ చేసింది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్ధిక నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాజధానిలోని రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.